మా సంస్థ - తెలుగురధం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ - తదుపరి కార్యక్రమాన్ని తలపెట్టింది.
జయదేవ కవి ఆరాధనోత్సవం (మార్గశిర కృష్ణ ఏకాదశి) సందర్భంగా శ్రీ గీత గోవిందం లోని అష్టపదుల కృతుల్ని "స్వర రాగ గీత నీరాజనం" అనే అంశంగా శ్రీమతి ఎర్రమిల్లి రమాప్రభ గారిచే సంగీత కార్యక్రమం జరుగుతుంది.
చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలోని కళా వెంకట సుబ్బారావు కళావేదిక లో 27 డిసంబర్ సోమవారం సా. 6 గంటలకు జరుగును. సాహిత్య, సంగీత సాంస్కృతిక అభిమానులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తున్నాము.భారత దేశానికంతకూ సంగీత సాహిత్యాత్మకమైన తొలి ప్రబంధం, భక్తి రూపాన్నమైన మధురోజ్జ్వల రసరాట్టు, వసంత కుసుమాకర పూర్ణచంద్రోదయ మేళవింపుల రంగరింపుల రసగుళిక శ్రీ గీత గోవిందం గా భావించబడుతోంది. శృంగార వివేక తత్త్వ రచన, అమలిన ప్రేమ కథ, ప్రేమోల్లాస విలాసం, కళాసౌందర్య సాక్షాత్కారం, మధుర భక్తి రూపకం, సంస్కృత సాహిత్య సరస్వతికి అమూల్యాలంకార రమణీయకృతి గా విరాజిల్లుతున్న ప్రనంద సృష్టికర్త జయదేవ కవికి స్వరరాగ నీరాజనం సమర్పించే ప్రయత్నంలో అందరి సహాయ సహకారాలను అందించవలసినదిగా కోరుకుంటున్నాము.
మిగతా వివరాలకు - కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురధం. 97017 31333
No comments:
Post a Comment